NLG: చండూరులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు లైన్మెన్ షరీఫ్ పాషా తెలిపారు. శ్రీ మార్కండేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మునుగోడు రోడ్, మున్సిపల్ ఆఫీస్, కనకదుర్గమ్మ గుడి, ఆయిల్ మిల్ రోడ్ ప్రాంతాల్లో కోత ఉంటుందని వివరించారు. భక్తుల రక్షణ, రథోత్సవ నిర్వహణ దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.