KKD: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కోరారు. శనివారం కాకినాడ ఏఆర్ పోలీస్ క్వార్టర్స్ వద్ద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలునాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.