ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న MLA బండారు శ్రావణి శనివారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. తోటి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలతో కలిసి ఈ విందులో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో రాజకీయ అంశాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.