KRNL: పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో EORD జయరాముడు, పంచాయతీ కార్యదర్శి ఈరన్న పాల్గొని గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు కూడా పాల్గొని పరిసరాలను శుభ్రం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు.