NZB: డిచ్పల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఐ వినోద్, ఎస్సై ఆరీఫ్ పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఇస్లాంపురంలోని మజీద్లో సదర్ హమీద్, వసీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై ముస్లిం సోదరులతో దీక్ష విరమణ చేయించారు. హిందూ ముస్లింలు అందరూ కలిసి మెలిసి పండగలు చేసుకోవాలని సీఐ సూచించారు.