HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో సోమవారం పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని జరుపుకున్నారు.1981-82వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు సమావేశాన్ని జరుపుకుని ఆత్మీయతను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు కతోలిక పీఠాధిపతిగా కొనసాగుతున్న జయ రావు పులిమేరాను సహచర మిత్రులు ఘనంగా సన్మానించారు.