SRPT: అనంతగిరి మండలం ఖానాపురం నర్సరీని ఎంపీడీవో హరి సింగ్ నాయక్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకం, సంరక్షణను పరిశీలించారు. మొక్కల స్థితిగతులపై సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్న ఆయన, సంరక్షణలో మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీని సందర్శించి, గ్రామపంచాయతీలో పలు రికార్డులను పరిశీలించారు.