BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. దీంతో ఉచిత సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.