AP: సింగపూర్లో మూడో రోజు ఏపీ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని మంత్రులు సందర్శించారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని పీఎస్ఏ పోర్టు కార్యకలాపాల్లో వినియోగిస్తుంది. పోర్టులో కంటైనర్ల తరలింపునకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై, షిప్పింగ్, లాజిస్టిక్స్లో ఏఐ సాంకేతికతను అధ్యయనం చేస్తున్నారు.