NZB: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. నిజామాబాద్ నార్త్ మండల వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 3,270 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం 13 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 160 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.