NRML: సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ప్రతి ఇంటి నల్లాకు ఆన్ఆఫ్ బటన్లు బిగించారు. గ్రామంలో నీటి వృథా అరికట్టేందుకు సర్పంచ్ కరిపే రవళి విలాస్ ఆధ్వర్యంలో ఈ ఆన్ఆఫ్లు బిగించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కుళాయిలకు ఆన్ఆఫ్ స్విచ్లు లేని వాటికి బిగించారు. వారితో మాట్లాడుతూ.. నీటిని వృథా చేయరాదని తెలిపారు. వేసవి కాలం నీటిని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు.