HYD: హబ్సిగూడలో నివసించే ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో పనిమనిషే 9.30 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె వద్ద నుంచి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.