NTR: నీరు వృథాగా బయటకు వెళ్లిపోతుందని, తక్షణం మరమ్మతులు చేయకుంటే జగ్గయ్యపేట,షేర్ మహమ్మద్ పేటకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం వారు తహశీల్దార్ మనోహర్ను కలిసి ఎస్ఎం పేట గ్రామ చెరువు నీరు లీకై వృథాగా పోతుందన్నారు. ఎస్ఎం పేటలో భూగర్భ జలాలు తగ్గిపోయి తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.