RR: దిల్సుఖ్నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి (వంద కోట్లు) జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఛైర్మన్, ఆలయ ట్రస్ట్ సభ్యులు స్పీకర్ను శాలువాతో ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు.