MHBD: కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన బొడ్డు యేసురత్తి, మణెమ్మలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయింది. డోర్నకల్ MLA డా. రామచంద్రనాయక్ ఆదేశానుసారం ఇంటి నిర్మాణానికి ముగ్గు పొసే కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రామ సర్పంచ్ తొడుసు నాగార్జున్ కొబ్బరికాయ కొట్టి ముగ్గు పోశారు. ఉపసర్పంచ్ కోర్నీ చందునరేష్, పంచాయతీ సెక్రెటరీ నరేష్, గ్రామస్తులున్నారు.