KMR: తాడ్వాయి మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్రాహ్మణపల్లి, కరడపల్లి గ్రామాల్లో బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు ప్రస్తుతం నీరందక ఎండిపోతున్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడులు కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.