VKB: పురపాలక సంఘం అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం బడ్జెట్ సమావేశంలో ఆయన ఎక్స్ అఫీషియో సభ్యునిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. TUFIDC ద్వారా ఇప్పటికే రూ. 60 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే HMDA నుంచి రూ.270 కోట్ల నిధులు రానున్నాయని వెల్లడించారు.