KMM: తిరుమలాయపాలెం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం సుబ్లేడులో కొత్తగా వారాంతపు సంతను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రతి వారం ఈ సంత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం సంత నిర్వహించే ప్రదేశాన్ని డోజర్తో శుభ్రం చేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.