SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మగుండం పునర్నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు. దాతల సహకారంతో జరుగుతున్న ఈ పనులను బ్రహ్మోత్సవాల (జాతర)లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.