ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురంలో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో ఫెర్రర్ చేసిన సేవలను మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఈ ఏడాది ఆర్డీటీకి FCRA అనుమతి సాధించి, సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగేలా కృషి చేశామని పేర్కొన్నారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని లోకేశ్ కొనియాడారు.