GNTR: కాకుమాను మండలం అప్పాపురం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. పసిపిల్లలకు పౌష్టికాహారం కింద పాడైన గుడ్లు ఇస్తుండటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.