HNK: కేయూ ఇంజినీరింగ్ కాలేజీ (కో ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో VBYP 2026 హనుమకొండ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై ఈ పోటీలు మార్చి 2న కేయూలో నిర్వహిస్తామన్నారు. 2025 సెప్టెంబర్ 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉండాలన్నారు.