కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు (78) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. హాసనాబాద్లో జరిగిన ఆయన అంతిమయాత్రలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పాడె మోశారు. వీరభద్రరావు మృతి పార్టీకి, ప్రాంతానికి తీరని లోటని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.