NRML: పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని మామడ మండలం కొరటికల్కు చెందిన వినీష నిరూపించింది. ముత్తన్న-లక్ష్మి దంపతుల కుమార్తె అయిన వినీష ఎంపీసీలో 469/470 మార్కులు సాధించి సత్తా చాటింది. ప్రభుత్వ పాఠశాల నేపథ్యం నుంచి వచ్చి రాష్ట్రస్థాయి మార్కులు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.