WGL: కాకతీయ యూనివర్సిటీలో వాయిదా పడిన MCA మొదటి సెమిస్టర్ పరీక్షల కొత్త షెడ్యూల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ వెల్లడించారు. మొదటి పేపర్ మార్చి 6న, రెండవ పేపర్ మార్చి 9న, మూడవ పేపర్ మార్చి 11న, నాలుగవ పేపర్ మార్చి 13న, ఐదవ పేపర్ మార్చి 17న నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.