కృష్ణా: రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కంకిపాడు టీడీపీ కిషోర్ బాబు ఈరోజు అన్నారు. సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సేవ చేయడం ఎమ్మెల్యే ప్రత్యేకత అని తెలిపారు.