VKB: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 2 రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. డిజిటల్ లాగిన్ కీ సమస్యతో లావాదేవీలు ఆగిపోయినట్లు సమాచారం. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సేవలు పునరుద్ధరించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.