VZM: జిల్లాలో డీజిల్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరా అధికారి జి. మురళీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ సరఫరాపై వీసీలో సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడా డీజిల్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.