ADB: తెలంగాణ ప్రాంత ప్రజలను అవమాన పరుస్తూ BJP MP తేజస్వి సూర్య పార్లమెంటులో చర్చించిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బోథ్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అనీష్ కుమార్ అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా- పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు.