JGL: ధర్మపురి ఎస్సై జి.మహేష్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. ధర్మపురిలో ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల ముగింపు సందర్భంగా హెల్మెట్ ధరించిన వాహనదారులకు ఆయన చాక్లెట్లు పంపిణీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, టూవీలర్లను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు.