AKP: దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి ఉత్సవ విగ్రహాలు, ధూపదీప నైవేద్యాల కోసం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని కలిసి వినతిపత్రం శనివారం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పంచలోహ విగ్రహాలు, నైవేద్యాల కోసం నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.