ప్రకాశం: వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం కనిగిరికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్తూరు ఆంజనేయులు స్వామి దేవస్థానం వద్ద వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికి, దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.