AKP: సీఐటీయూ రాష్ట్ర కౌన్సల్ సభ్యుడిగా అనకాపల్లి జిల్లాకు చెందిన గనిశెట్టి సత్యనారాయణ ఎన్నిక అయ్యారు. నంద్యాలలో ఈనెల 17 నుంచి 19 వరకు రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నట్లు గనిశెట్టి సోమవారం తెలిపారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలన్నారు. పరిశ్రమలలో స్థానికులకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.