E.G: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు.