ELR: రబీ పంట మాసూళ్ల దృష్ట్యా రైల్వే గేటు మూసివేతను వాయిదా వేయాలని కోరుతూ భీమడోలు రైతులు శనివారం తహశీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ట్రాక్ మరమ్మతుల కోసం ఈ నెల 20 నుంచి పది రోజుల పాటు గేటు మూసివేస్తామన్న రైల్వే నోటీసుపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా పనులు వాయిదా వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.