PDPL: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. 22 కేంద్రాలలో 10,367 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.