ATP:పెద్దవడుగూరు మండలంలోని జి. వెంకటాంపల్లి గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు. ఒక జేసీబీని సీజ్ చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాలను తహసీల్దారు ఉషారాణికి అప్పగించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి,ఇసుక తరలిస్తే చర్యలు తప్పవన్నారు.