AKP: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి డిపో నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇక్కడి నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు.