WGL: సంగెం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను అదనపు కలెక్టర్ సంధ్య రాణి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి ఆహారం నాణ్యత, పరిమాణంపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అడిగి తెలుసుకుని, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు.