నారాయణపేట పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తాలో ఆదివారం వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి వాహనదారుడి బాధ్యత అని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదన్నారు.