SDPT: కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యా లయాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె. బగారా అన్నం రుచికరంగా లేకపోవడం, కూరలు పల్చగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.