RR: వార్డు అభివృద్ధి విషయంలో నిరంతరం ప్రజల వెంట ఉంటానని షాద్నగర్ పట్టణ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ అన్నారు. బాబా నగర్ కాలనీలోని పార్క్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.