SRD: సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్లో మంచినీటి ట్యాంక్ నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అమృత్ 2.0 నిధుల్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆరు మంచినీటి ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించారు. కాగా ప్రశాంత్ నగర్లో ఒక చోట మాత్రమే పిల్లర్ల స్థాయి వరకు నిర్మించి వదిలేశారు. మంచినీటి ట్యాంకులు నిర్మాణాలను వేగవంతం చేయించాలని కోరుతున్నారు.