మెదక్: రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో సర్పంచ్ మస్కూరి బాలరాజు, కార్యదర్శి మాధవి ఆధ్వర్యంలో ‘డ్రై డే-ఫ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుధ్య మెరుగుదల, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తూ, గ్రామంలో నిల్వ ఉన్న నీటిని తొలగించేలా ప్రజలను చైతన్య పరిచారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన సంక్షేమ పథకాల ప్రాముఖ్యతపై వివరించారు.