NRPT: ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం స్థానిక వార్డు సభ్యులు సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం వండకపోవడం, నాణ్యత లోపించడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.