SDPT: తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాశికంటి సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కాంచిట్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ సాధించిన ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం అన్నారు.