MNCL: లక్షెట్టిపేట పట్టణంలో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈవో శైలజ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షల కోసం పట్టణంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జడ్పీ బాలికలు, ట్రినిటీ, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. పరీక్షలకు 773 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 36 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.