PDPL: ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామమైన పెద్దపల్లికి ఆదివారం వచ్చారు. 1980లో ఉద్యమ బాట పట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగి ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.