HYD: నగరంలో గాలి కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నరసింహ కాలనీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 218గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం, కట్టెల పొయ్యిల వాడకమే దీనికి ప్రధాన కారణాలని అధికారులు గుర్తించారు. గాలి నాణ్యత క్షీణించడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పు ఉందని వైద్యులు సూచించారు.