NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జి.ప.ఉ. పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం క్యూరియా గ్లోబల్ సంస్థ రూ.2.25 లక్షల విలువైన 11 టేబుళ్లు, 10 కుర్చీలు, 10 ర్యాక్లను ఆదివారం అందజేసింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, క్యూరియా సైంటిస్ట్ డా. ఆవుల రాఘవేందర్ చొరవతో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయం అందింది. కంపెనీ బృందానికి, రాఘవేందర్కు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు.